శ్రీశ్రీశ్రీ పైడిమాంబ అమ్మవారిని దర్శించుకున్న కార్పొరేటర్ ముమ్మన
(కలం లీడర్ న్యూస్ ) వేపగుంట గ్రామంలో కొలువైన ఉన్న శ్రీశ్రీశ్రీ పైడిమాంబ అమ్మవారి తీర్ద మహోత్సవము పురస్కరించుకొని ఆలయ ధర్మకర్త,అడ్వకేట్ మామిడి రాజు ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా పెందుర్తి బిజెపి నాయకులు,జీవీఎంసీ 95వ వార్డు కార్పొరేటర్ ముమ్మన దేముడు మంగళవారం నాడు పాల్గొని అమ్మవారికి విశేష అభిషేక పూజలు చేసి తీర్థ ప్రసాదములు స్వీకరించారు,ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ అమ్మవారి కృపాకటాక్షాలు,చల్లని దీవెనలు ఈ ప్రాంత ప్రజలపై మెండుగా ఉండాలని ఆకాంక్షించారు,కార్యక్రమంలో గ్రామ పెద్దలు బల్ల రాంబాబు,తెలసరి కనకరాజు,చేవ్వేటి జల్లుబాబు,అప్పికొండ రాంబాబు,గంట్ల నర్సింహామూర్తి,గంట్ల దేముడు,కంచిబోయిన వెంకట సంతోష్,అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు

