శ్రీ సీతారాముల కళ్యాణంలో కార్పొరేటర్ ముమ్మన
జీవీఎంసీ 95వ వార్డు చీమలాపల్లి గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీశ్రీశ్రీ కోదండ సీతారామాలయంలో ఆలయ కమిటీ సభ్యులు శ్రీ సీతారాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు,ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు స్థానిక జీవీఎంసీ 95వ వార్డు మాజీ కార్పొరేటర్ ముమ్మన దేముడు పాల్గొని ప్రత్యేక అభిషేక పూజలు చేసి సీతారాముల కళ్యాణాన్ని తిలకించారు,ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని స్వామిని వేడుకున్నారు,అనంతరం 2000 మందికి ఏర్పాటు చేసిన అన్నదానంలో ముమ్మన దేముడు భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు,కార్యక్రమంలో గ్రామ పెద్దలు,యువత,ఆలయ కమిటీ సభ్యులు,మాజీ ఎంపీటీసీ అయిత యెర్రయ్య,బిజెపి 95,97వ వార్డు అధ్యక్షులు చిక్కాల సతీష్,టిడిపి 95వ వార్డు అధ్యక్షులు అయిత ఎర్నిబాబు,బిజెపి 95,97వ వార్డుల ప్రధాన కార్యదర్శి రాపర్తి దుర్గాప్రసాద్,గ్రామ ప్రతినిధులు దువ్వి అప్పారావు,కంచిబోయిన వెంకట సంతోష్,సబ్బవరపు ప్రకాష్,అయిత అప్పలరాజు,చిప్పల చందు,బొట్ట గోవింద్,బొట్ట నూకఅప్పలరాజు,కెంగం రామకృష్ణ స్వామి,రెడ్నం హరి కుమార్,అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు,

