img 20251022 wa0057

సుజాతనగర్ రత్నగిరి నగర్ పార్క్‌లో ప్రజలకు అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు.

అనకాపల్లి క్రైమ్

 

విశాఖపట్నం ..పెందుర్తి. కలం లీడర్ న్యూస్…

ఈరోజు పెందుర్తి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కె.వి. సతీష్ కుమార్ గారు సుజాతనగర్ రత్నగిరి నగర్ పార్క్‌లో ప్రజలకు అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాలనీవాసులు, మహిళలు, యువతులు పాల్గొన్నారు.

 

ఇన్స్పెక్టర్ గారు ముఖ్యంగా ఈ విషయాలను వివరించారు:

 

మహిళలపై నేరాలు: మహిళలపై ఎవరైనా నేరకార్యం చేసినట్లయితే వెంటనే పోలీస్‌కి తెలియచేయాలని సూచించారు. పోలీసులు ఎల్లప్పుడూ మహిళలతో ఉంటారు. సమాచారం పూర్తిగా గోప్యంగా ఉంచబడుతుంది అని హామీ ఇచ్చారు.

 

సైబర్ నేరాలు: ఫైబర్ నేరాలు, మోసపూరిత కార్యకలాపాల గురించి వివరించారు. ఎవరు సైబర్ నేరాలకు గురవుతారో జాగ్రత్తలు తీసుకోవాలని, ఎవరైనా ఇబ్బందులలో ఉంటే పోలీసులను సంప్రదించాలని సూచించారు.

 

మద్యం, డ్రగ్స్: గంజాయి లేదా ఇతర నేరకార్యాలతో దూరంగా ఉండాలని, మంచి భవిష్యత్తు కోసం సరైన మార్గంలో ఉండాలని తెలియచేశారు.

 

సామాజిక సమాచారం: అసాంఘిక కార్యకలాపాల గురించి ఎవరికైనా సమాచారం ఉంటే, దానిని పెందుర్తి పోలీస్ స్టేషన్‌కి తెలియచేయవచ్చని, సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.

 

 

ఇన్స్పెక్టర్ గారు ఈ అవేర్నెస్ ప్రోగ్రాం ద్వారా ప్రజల భద్రత మరియు సమాజంలో న్యాయ పరిరక్షణకు స్ఫూర్తి కల్పించారు.

 

పెందుర్తి పోలీస్ స్టేషన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *