- ఈ రోజు పెందుర్తి పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ కె.వి. సతీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో, పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించబడింది.

ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ గారు రౌడీషీటర్లతో మాట్లాడుతూ,
వారి ప్రతి కదలికపై పోలీస్ సర్వీలెన్స్ ఉందని,
అసాంఘిక, చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని,
వారి ప్రవర్తన కుటుంబ సభ్యులపై కూడా ప్రతిఫలిస్తుందని గమనించాలని,
సమాజంలో మంచి వ్యక్తులుగా మారేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.
అలాగే, తప్పుదారులు విడిచిపెట్టి, సమాజ హితానికి తోడ్పడే విధంగా నడుచుకోవాలని, చట్టానికి లోబడి జీవనాన్ని సద్వినియోగం చేసుకోవాలని సలహా ఇచ్చారు. ఈ కౌన్సిలింగ్లో రౌడీషీటర్లకు ప్రోత్సాహకరమైన మాటలతో, మంచి భవిష్యత్తు కోసం మార్పు అవసరాన్ని వివరించారు.

