వెంకన్నకు వైసీపీ నేతల అపచారం క్షమార్హం కాదు
కలంలీడర్ న్యూస్- పెందుర్తి: వైసీపీ నేతలు చెప్పులు వేసుకుని కలియుగ
దైవం వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని పట్టుకొని అసెంబ్లీలో నిరసన తెలియజేయడంపై రాష్ట్ర గవర్ కార్పొరేషన్ డైరెక్టర్ వేగి పరమేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. చెప్పులు వేసుకుని స్వామి వారి చిత్రపటాలతో ర్యా చేస్తారా? ఇది భక్తులను అవమానించడం, మనోభావాలు దెబ్బతీసే విధంగా వైసీపీ నాయకులు దేవుడిని రాజకీయాల్లోకి తీసుకొచ్చి కొత్త వివాదానికి తెరలేపుతున్నారని ఆయన విమర్శించారు. వెంకటేశ్వర స్వామికి అపచారం చేసిన వైసీపీ నాయకులు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు.

